అప్పుడు పోలీసుల కాళ్లు మొక్కాడు.. ఇప్పుడు రైతులకు కాడి పట్టాడు..
విశాఖ జిల్లా అరకు వైసీపీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం మొట్టుజోరె పంచాయతీలో బైక్ పై పర్యటించాడు.
విశాఖ జిల్లా అరకు వైసీపీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం మొట్టుజోరె పంచాయతీలో బైక్ పై పర్యటించాడు. ఉపాధి పనులు చేస్తున్న రైతులతో ప్రభుత్వ పథకాలపై ముఖాముఖీ చర్చించారు.ఉపాధి పనులు చేస్తున్న రైతుల వద్దకు వెళ్ళి వాళ్ళతో కలిసి కాసేపు పని చేసారు. ఇప్పుడంతా ప్రజలవద్దకే పాలన అని, ఒక్క ఫోన్ చేస్తే చాలు వచ్చేస్తానని వారికి అభయమిచ్చారు. చెట్టి పాల్గుణ గత నెలలో కరోనా కోసం పనిచేస్తున్న పోలీసుల కాల్లు మొక్కిన సంగతి తెలిసిందే.