Asianet News TeluguAsianet News Telugu

పొన్నూరు వైసిపిలో వర్గపోరు ... ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే వర్గం నిరసన

 అమరావతి : గుంటూరు జిల్లా పొన్నూరు వైసిపిలో వర్గపోరు రచ్చకెక్కింది.

First Published Oct 11, 2022, 4:41 PM IST | Last Updated Oct 11, 2022, 4:41 PM IST

 అమరావతి : గుంటూరు జిల్లా పొన్నూరు వైసిపిలో వర్గపోరు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే కిలారి రోశయ్య వర్గం, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ వర్గాల మధ్య సాగుతున్న విబేధాలు తాజాగా భగ్గుమన్నారు. పెదకాకాని మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణాపై జరిగిన దాడిపై మాజీ ఎమ్మెల్యే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ దాడి ఎమ్మెల్యే వర్గీయుల పనేనని ఆరోపిస్తున్నారు. వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ వర్గం ఆందోళనకు దిగింది. వైసీపీ శ్రేణుల నిరసన నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు జరక్కుండా పోలీసులు భారీగా అక్కడకు చేరుకున్నారు. నిరససకు దిగిన మాజీ ఎమ్మెల్యే వర్గీయులను సముదాయించి విరమింపజేసేందుకు ప్రయత్నించారు.