విశాఖలో 325 కిలోల గంజాయి పట్టివేత
విశాఖపట్నం జిల్లాలో ఆదివారం భారీగా గంజాయిని పట్టుకున్నారు.
విశాఖపట్నం జిల్లాలో ఆదివారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్పోస్ట్ వద్ద ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో చింతపల్లి ఏజెన్సీ నుంచి వస్తున్న హెచ్ఆర్ 55బీ 5312 నెంబర్ గల కంటైనర్ను ఆపి పరిశీలించగా అందులో 325 కిలోల గంజాయి లభ్యమైంది. వ్యాన్లో దీనిని అక్రమంగా రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులు పరారయ్యారని ఎక్సైజ్ శాఖ సీఐ తెలిపారు. దీని విలువ సుమారు 16 లక్షలు ఉంటుందని ఆయన వెల్లడించారు.