Asianet News TeluguAsianet News Telugu

ఇంద్రకీలాద్రి ని సందర్శించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సంస్థ చీఫ్ శ్రీ మోహన్ భగవత్

ఇంద్రకీలాద్రిలో  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  సంస్థ చీఫ్ శ్రీ మోహన్ భగవత్ గారు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేశారు. 

ఇంద్రకీలాద్రిలో  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  సంస్థ చీఫ్ శ్రీ మోహన్ భగవత్ గారు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేశారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కార్యనిర్వహణాధికారి వారు RSS ఛీఫ్ శ్రీ మోహన్ భగవత్ గారికి అమ్మవారి దర్శనము కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనము చేశారు.అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి  గారు అమ్మవారి ప్రసాదము, పట్టు వస్త్రములు మరియు చిత్రపటము ను శ్రీ మోహన్ భగవత్  గారికి అందజేసినారు.