జగన్ భూమిపూజ స్థలంలో జనసేన ఆందోళన... తాడేపల్లిలో ఉద్రిక్తత
తాడేపల్లి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఆర్డిఏ పరిధిలో ఇళ్ల నిర్మాణాన్ని భూమిపూజతో ప్రారంభించారు.
తాడేపల్లి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఆర్డిఏ పరిధిలో ఇళ్ల నిర్మాణాన్ని భూమిపూజతో ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ ఆందోళన చేపట్టింది. సీఎం భూమిపూజ ప్రాంతానికి చేరుకున్న జనసైనికులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకు దిగిన జనసేన నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోర్టు పరిధిలో ఉన్న భూములను పేదలకు పంచడాన్ని జనసేన పార్టీ వ్యతిరేకిస్తోంది.