Asianet News TeluguAsianet News Telugu

ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద ప్రవాహం.. మొదటి ప్రమాదహెచ్చరిక జారీ..

అమరావతి : ప్రకాశం బ్యారేజ్ కు కృష్ణా వరద‌ ఉధృతితో వరద ప్రవాహం పెరుగుతోంది. 

First Published Oct 15, 2022, 10:43 AM IST | Last Updated Oct 15, 2022, 10:43 AM IST

అమరావతి : ప్రకాశం బ్యారేజ్ కు కృష్ణా వరద‌ ఉధృతితో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 4.07 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రవాహం మరింత పెరిగితే.. ముంపుకు  గురికాబోయే ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేశారు.  కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు అని చెప్పారు.