Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి... సీఎంవోలో బాధ్యతల స్వీకరణ

అమరావతి: ఇటీవలే ఏపీ సీఎంవోలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

First Published Feb 28, 2022, 6:16 PM IST | Last Updated Feb 28, 2022, 6:16 PM IST

అమరావతి: ఇటీవలే ఏపీ సీఎంవోలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రవీణ్ ప్రకాష్ అనూహ్యంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్. జవహర్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. తాజాగా సీఎం క్యాంప్ కార్యాలయంలోని తన చాంబర్ లో నూతన బాధ్యతలను స్వీకరించారు జవహర్ రెడ్డి. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాష్‌ను నియమించారు.