Asianet News TeluguAsianet News Telugu

అంబులెన్సు వుంది..ఆసుపత్రి వుంది..కానీ..

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట్ల గ్రామంలో మిరప పండు కోయడానికి  వెళ్ళిన 50 మంది కూలీలపైన తేనెటీగలు దాడిచేశాయి.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట్ల గ్రామంలో మిరప పండు కోయడానికి  వెళ్ళిన 50 మంది కూలీలపైన తేనెటీగలు దాడిచేశాయి. గాయపడిన వారిని  అంబులెన్సు లో ప్రభుత్వ ఆసుపత్రికి కి తీసుకొచ్చారు. కానీ అక్కడ సిబ్బంది ఎవరిని పట్టించుకోక పోవడంతో వాళ్ళు చాల ఆవేదన చెందారు. ప్రవేటు ఆసుపత్రి వెళ్లే స్థోమత లేక ఇక్కడికి వస్తే డాక్టర్ అందుబాటులో లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వాళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా వుంది. చివరికి గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రికె వెళ్లారు.