Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో సీపీఎం, సీఐటీయూ నాయకులు అరెస్ట్లు

అంతర్జాతీయ  పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీని తరలించాలని, విశాఖలో పర్యావరణాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సీపీఎం, సీఐటీయూ నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. 

అంతర్జాతీయ  పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీని తరలించాలని, విశాఖలో పర్యావరణాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సీపీఎం, సీఐటీయూ నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. ఉదయం 9.45 కు గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుండి మానవహారం నిర్వహించాలని ప్రయత్నం. అయితే తెల్లవారుజాము నాలుగున్నరనుండే సీపీఎం , సీఐటీయూ నాయకుల ను ఇండ్ల దగ్గరే అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్టులను సీపీఎం నగర కార్యదర్శి డా. బి.గంగారావు తీవ్రంగా ఖండించారు. అరెస్టుల ద్వారా ఎల్జీ పాలిమర్స్ తరలింపు ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేరని అన్నారు.