Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ భారతిపై సోషల్ మీడియా పోస్టుల కేసు... సీఐడి ముందుకు చింతకాయల విజయ్

అమరావతి : మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు, ఐటిడిపి నిర్వహకుడు విజయ్ ఇవాళ(గురువారం) సిఐడి విచారణకు హాజరయ్యారు. 

First Published Feb 16, 2023, 1:36 PM IST | Last Updated Feb 16, 2023, 1:36 PM IST

అమరావతి : మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు, ఐటిడిపి నిర్వహకుడు విజయ్ ఇవాళ(గురువారం) సిఐడి విచారణకు హాజరయ్యారు. గతేడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య భారతిని లక్ష్యంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చక్కర్లు కొట్టింది. అయితే దీన్ని ఐటిడిపి బాగా సర్క్యులేట్ చేసిందంటూ పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ కేసు విచారణలో భాగంగానే చింతకాయల విజయ్ ను గతనెల జనవని 30న సిఐడి విచారణకు హాజరయ్యారు. విచారణ పూర్తికాకపోవడంతో ఇవాళ మరోసారి హాజరుకావాల్సిందిగా సిఐడి అధికారులు కోరారు. దీంతో విజయ్ లాయర్ ను వెంటబెట్టుకుని సీఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.