Asianet News TeluguAsianet News Telugu

రాజధాని తరలింపుపై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాజధాని తరలింపుపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని.. కరోనా నుంచి బయటపడిన తర్వాతే దాని గురించి మాట్లాడతామని స్పష్టం చేశారు.

రాజధాని తరలింపుపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని.. కరోనా నుంచి బయటపడిన తర్వాతే దాని గురించి మాట్లాడతామని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని గురించి మాట్లాడలేమని  ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. జులైలో కేసులు రెట్టింపు లేదా మూడు రెట్లు పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని తరలింపుపై ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలేదు. ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలంటే ఇవన్నీ సద్దుమణగాలి. కరోనా తగ్గిన తర్వాతే రాజధానిపై మాట్లాడతామన్నారు.