Wrestlers’ protest: డబ్ల్యూఎఫ్ఐ నిర్ణయాలు తీసుకునేటప్పుడు దాని నిబంధనలను పాటించనందుకు క్రీడా మంత్రిత్వ శాఖ రెజ్లింగ్ సంఘాన్ని సస్పెండ్ చేసింది. ఈ క్రమంలోనే భారత ఒలింపిక్ సంఘం ముగ్గురు సభ్యుల అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, పతకాలు, అవార్డులను తిరిగిచ్చేసిన పలువురు అథ్లెట్లు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.