Indrakeeladri: బెజవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పొటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దసరా నవరాత్రి వేడుకలలో భాగంగా తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.