Shamshabad Airport:అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు కస్టమ్స్ అధికారులు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కేటుగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలోని శ్రీ రాజీవ్ గాంధీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సొమాలియా దేశానికి చెందిన ఓ ప్రయాణికుడి వద్ద 30 లక్షల విలువ చేసే యూఎస్ డాలర్స్ ను ఆక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.