Mathura: ఉత్తరప్రదేశ్ లోని మథురలో స్నేహితులతో సెల్ఫీ తీసుకుంటుండగా 18 ఏళ్ల యువకుడిని రైలు ఢీకొట్టింది. తివారీపురం రైల్వే బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు వంశ్ అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఉదయం ద్వారకా ధీష్ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లాడు. అయితే హోలీ గేట్ వద్ద ట్రాఫిక్ కారణంగా ముగ్గురూ జమునా పర్ ప్రాంతంలోని తివారీపురం వైపు వెళ్లారు. అక్కడ స్కూటర్ పార్క్ చేసి బ్రిడ్జిపై సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.