Raghunandan Rao: మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలకు మాజీ ఎమ్మెల్యే , బీజేపీ నాయకులు రఘునందన్ రావు ఓపెన్ చాలెంజ్ విసిరారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంలోని నేతలు పోటీ చేసి.. ఒక్క సీటు అయినా తెచ్చుకోవాలని ఓపెన్ చాలెంజ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను కేటీఆర్ పులి అంటున్నారు. పులి జనాల్లో ఎందుకు ఉంటుంది. అడవీలో ఉంటుందనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. కేసీఆర్ పులికాదు, పిల్లి అంతకన్నా కాదు ఎలుక అని రఘునందన్ ఎద్దేవా చేశారు.