ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జోరం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) ఘన విజయం సాధించింది. జెడ్పీఎంకు 27 సీట్లు, ఎంఎన్ఎఫ్కు 10 సీట్లు వచ్చాయి. సీఎం జోరంతంగా సహా డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులను చిత్తుగా ఓడించారు జనం.
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదశ్, ఛత్తీస్గఢ్, మిజోరంలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ఆదివారమే జరగనుంది. కానీ అనివార్య కారణాలతో మిజోరంలో కౌంటింగ్ ప్రక్రియను డిసెంబర్ 4 (సోమవారం)కు వాయిదా వేసింది ఎన్నికల సంఘం.