Ghulam Nabi Azad: ప్రస్తుతం దేశంలో రాజకీయాలు అసహ్యంగా తయారయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయనీ, ఆ బాధ్యతను సామాజిక సంస్థలు తీసుకోవాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.