Doda bus accident : జమ్మూ కాశ్మీర్ లో బస్సు లోయలో పడిన ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 36కి చేరుకుంది. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.
జమ్మూకాశ్మీర్ లోని దోడా జిల్లాలో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 30 మందికి పైగా మరణించారు. ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికుల ఉన్నారు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.