అనుకోకుండా.. భార్య ఇంట్లో బలవనర్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆమె చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకోవడం గమనార్హం. 

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ తెలంగాణలో ఆత్మహత్యకు పాల్పడింది. భర్తతో జరిగిన గొడవ కారణంనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

కర్ణాటక రాష్ట్రానికి చెందిన భార్యభర్తలు.. తెలంగాణ రాష్ట్రంలో ని కరీంనగర్ జిల్లాలో స్థిరపడ్డారు. వారు అక్కడ బేకరీ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా.. అనుకోకుండా.. భార్య ఇంట్లో బలవనర్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆమె చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకోవడం గమనార్హం.

కాగా.. భర్తతో ఉదయం ఓ విషయంలో గొడవ జరగడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. భర్త బేకరీకి వెళ్లగానే ఆమె బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. తన చావుకి ఎవరూ కారణం కాదంటూ ఆమె సెల్ఫీ వీడియోలో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.