నడిరోడ్డుపై బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
ప్రసవ వేదనతో బాధపడుతున్న నిండు గర్బిణీ ఆస్పత్రికి వెళ్లేలోపే నడిరోడ్డుపై ప్రసవించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ అబ్ధుల్లాపూర్మెట్కు చెందిన మేరియమ్మ అనే మహిళ శనివారం నొప్పులతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి వెళ్లింది.
ప్రసవ వేదనతో బాధపడుతున్న నిండు గర్బిణీ ఆస్పత్రికి వెళ్లేలోపే నడిరోడ్డుపై ప్రసవించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ అబ్ధుల్లాపూర్మెట్కు చెందిన మేరియమ్మ అనే మహిళ శనివారం నొప్పులతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి వెళ్లింది.
అక్కడి వైద్యులు పరీక్షించి అంతా బాగానే ఉంది... కానీ గాంధీ ఆసుపత్రికి వెళితే మంచిది అని చెప్పింది. దీంతో మేరియమ్మ మరో మహిళతో కలిసి వనస్థలిపురం నుంచి ఎల్బీ నగర్ వెళ్లే బస్సు ఎక్కింది.
అయితే ఆ కాసేపటికే నొప్పులు ఎక్కువ కావడంతో రోడ్డుపైనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారు.