Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి చేసుకోమన్నందుకు.. కత్తితో యువకుడిపై దాడి చేసిన యువతి..!

పెళ్లికోమని అడిగినందుకు ఓ యువకుడిపై కట్టర్ తో దాడి చేసింది ఓ యువతి. ఈ ఘటనలో యువకుడి మొహానికి తీవ్ర గాయాలయ్యాయి. 

woman attack a man over marriage proposal in hyderabad
Author
First Published Dec 9, 2022, 9:24 AM IST

హైదరాబాద్ : పెళ్లి చేసుకోమన్నందుకు ఓ యువతి, సదరు యువకుడిమీద బ్లేడ్ తో దాడి చేసిన ఘటన కేపీహెచ్ బీ కాలనీలో కలకలం రేపింది. తనతోస్నేహంగా ఉంటున్నందుకు చనువుతో పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు ఓ యువకుడు. దీంతో ఆ యువకుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది ఓ యువతి. ఈ ఘటనలో ఆమెకు గురువారం బెయిల్ దొరికింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ కుమార్తె లక్ష్మీ సౌమ్య (23) బీబీఏ పూర్తి చేసింది. ఆ ఛార్టెడ్ అకౌంటెంట్ భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటున్నాడు.  

కాగా, లక్ష్మీ సౌమ్యకు తండ్రి తో విభేదాలు ఉన్నాయి. దీంతో ఆరు నెలల క్రితం తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి వచ్చింది.  కేపీహెచ్బీలోని నాలుగో రోడ్డులో ఉన్న శ్రీ తనుజ హాస్టల్ లో చేరింది. క్రికెట్ కోచింగ్ తో పాటు ఉద్యోగం వెతుక్కోవడానికి హైదరాబాద్ కు వచ్చానని చెప్పింది. అయితే, మామూలుగా రాత్రి 10 గంటలకు హాస్టల్ గేట్లు మూసివేస్తారు. కానీ, లక్ష్మీ సౌమ్య ఎప్పుడూ ఆలస్యంగా హాస్టల్ కు వస్తుండేది. ఆమె ప్రవర్తన కూడా మగరాయుడిలా ఉండేది. దీంతో నచ్చక హాస్టల్ నిర్వాహకురాలు ఆమెను గది ఖాళీ చేయించింది. 

ఫోన్ వ్యసనం.. తగ్గించుకోవాలన్నందుకు నవ వధువు ఆత్మహత్య..

హాస్టల్ ఖాళీ చేసిన లక్ష్మీ సౌమ్య కేపీహెచ్బీ లోని 9 వ పేజీలో ఒక గది అద్దెకి తీసుకుని ఉంటుంది. ఆమె వేషధారణ, భాష అంతా మగరాయుడిలాగే ఉండేది. మిగతా అమ్మాయిలకు భిన్నంగా కనిపించేంది. గుంటూరు కు చెందిన నాదెండ్ల అశోక్ కుమార్ (27)కు ఈమెకు పరిచయం ఉంది. లక్ష్మీ సౌమ్య హాస్టల్ లో ఉన్నప్పుడు.. అక్కడికి సమీపంలో ఉన్న దేవి లగ్జరీ బాయ్స్ హాస్టల్ లో అశోక్ కుమార్ ఉండేవాడు. అతను ఒక గత ఏడు నెలలుగా అక్కడ ఉంటున్నాడు. ఎస్ఏపీ కోచింగ్ తీసుకుంటున్నాడు.

అశోక్ కుమార్ కు ఒక సోదరి ఉంది. ఆమె కూడా దగ్గరలోనే హాస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది. హాస్టల్ సమీపంలో ఉన్న ఓ టీ స్టాల్ దగ్గర లక్ష్మి సౌమ్యకు, అశోక్ కుమార్ కు పరిచయం ఏర్పడింది. రోజు అక్కడికి వెళుతుండేవారు. అలా చనువుగా మాట్లాడుకునేవారు. లక్ష్మీ సౌమ్యకు డబ్బులు అవసరమైనప్పుడల్లా అశోక్ కుమార్ ఇస్తూ ఉండేవాడు. కొద్దిరోజుల తర్వాత ఆమెతో ఉన్న చనువు కొద్ది ఆమెతో పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చాడు అశోక్ కుమార్. అయితే, ఆమె సమాధానం చెప్పలేదు. ఆ తరువాత ఎప్పుడు అడిగినా ఆమె మౌనంగానే ఉండేది.

ఈ నెల 5న అశోక్ కుమార్ పుట్టిన రోజు. ఆరోజు ఖర్చులు ఎక్కువగా ఉండడంతో తన ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అశోక్ కుమార్ లక్ష్మి సౌమ్యని అడిగాడు. దీంతో ఆమె అతనితో వాగ్వివాదానికి దిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. తన డబ్బులు తనకు ఇవ్వకుంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని అశోక్ కుమార్ బెదిరించాడు. దీంతో లక్ష్మీ సౌమ్యకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన తన దగ్గరున్న మినీ కట్టర్ తో అశోక్ కుమార్ మీద దాడికి దిగింది.  

చాకు లాంటి పదునైన వస్తువుతో దాడి చేయడంతో అశోక్ కుమార్ గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అశోక్ కుమార్ ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే, దాడిలో అశోక్ కుమార్ ముఖంలోని ఓ నరం తెగింది. దీంతో మొఖం ఎడమవైపు పక్షవాతం వచ్చిందని.. రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతాడని వైద్యులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios