Asianet News TeluguAsianet News Telugu

మద్యంమత్తులో గొడవ.. కొడవలితో భర్తను కొట్టి చంపిన భార్య..

మద్యం మత్తులో వేధింపులకు పాల్పడుతున్న భర్తను దారుణంగా హతమార్చిందో భార్య. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. 

Wife beat her husband to death with a crowbar in peddapalli
Author
First Published Jan 13, 2023, 12:27 PM IST

హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త వేధింపులతో విసిగిపోయిన భార్య అతడిని కొట్టి చంపింది. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటనలో 32 ఏళ్ల కూలి మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు గుగులోత్ తేజ నాయక్ మద్యానికి బానిసై తన భార్య కవితను రోజూ మద్యం మత్తులో వేధించేవాడు. గురువారం మధ్యాహ్నం కూడా మద్యం మత్తులో తేజ కవితతో వాగ్వాదానికి దిగాడు. ఆ తరువాత ఆమెపై దాడి చేశాడు.

"విసిగిపోయిన కవిత అందుబాటులో ఉన్న మట్టి తవ్వే క్రో బార్ తో తేజ తలపై దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన గుగులోత్ తేజ నాయక్ అక్కడికక్కడే మరణించాడు" అని పోలీసులు తెలిపారు. విషయం తెలియడంతో భర్త మృతికి కారణమైన కవితను అరెస్టు చేశారు.

ఇదిలా ఉండగా, ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిందో ఇల్లాలు. ఆ తర్వాత అతడు కనిపించడంలేదంటూ.. అందరిని నమ్మించాలని చూసింది. అడ్డంగా దొరికిపోయింది. విశాఖపట్నంలో సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..విశాఖపట్నం ఎంపీపీ కాలనీ సమీపంలోని వాసవానిపాలేనికి చెందిన జ్యోతి(25)కి ఆరేళ్ల కిందట.. భీమిలి మండలం వలందపేటకు చెందిన వంకా పైడిరాజు(28)తో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఐదేళ్ల బాలాజీ, మూడేళ్ల హర్షితలతో వీళ్లది ముద్దులొలికే కుటుంబం. కుటుంబ పోషణ కోసం పైడిరాజు టైల్స్ పనులు చేసేవాడు. అయితే,  జ్యోతికి వీరిద్దరికి వివాహం అయ్యే కంటే ముందే వాసవానిపాలేంలో వారి పొరుగు ఇంట్లో ఉండే వాడమొదలు నూకరాజు(25)తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. 

సంక్రాంతికి స్వగ్రామాలకు జనం: ప్రయాణీకుల పాట్లు,టోల్ ప్లాజాల వద్ద వాహనాల జామ్

పెళ్లి తర్వాత వారిద్దరి మధ్య కాస్త దూరం వచ్చినా.. ఇటీవల కాలంలో మళ్ళీ వారి మధ్య పరిచయం పెరిగింది. ప్రేమాయణం మొదలయ్యింది. జ్యోతి అత్త గారిది ఉమ్మడి కుటుంబం. దీంతో ఇక్కడ కలుసుకుంటే అందరికీ తెలిసిపోతుందని, కుదరదని వారిద్దరూ విశాలాక్షినగర్ లో ఓ గది అద్దెకు తీసుకున్నారు. ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం కోసం ఒక కొత్త కథ అల్లింది  జ్యోతి. సిబిఐ ఆఫీసులో హౌస్ కీపింగ్ లో పని దొరికిందని ఇంట్లో వాళ్ళను నమ్మించింది. ఆరు నెలలుగా ఈ వంకతో ప్రతిరోజు ఉదయం ప్రియుడి గదికి వెళ్ళేది. తిరిగి రాత్రి ఉద్యోగం నుంచి వచ్చినట్టుగా ఇంటికి వచ్చేది. 

ఈ క్రమంలో ప్రియుడిపై మోజు ఎక్కువ కావడం… ఈ విషయం బయటపడితే,  తమ సంబంధం ముందుకు సాగదని అనుకున్నారో ఏమో భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది. అలా డిసెంబర్ 29వ తేదీ రాత్రి భర్త పైడిరాజు తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. ఆ తర్వాత అర్థరాత్రి ఒంటిగంటకు ప్రియుడు నూకరాజుకి ఫోన్ చేయగా అతను తన సోదరుడి వరస అయ్యే కె. భూలోకతో కలిసి వచ్చాడు. అప్పటికే నిద్ర మాత్రల ప్రభావంతో గాడ నిద్రలో ఉన్న పైడిరాజు మేడకు తీగ బిగించారు. అలా హతమార్చారు. ఆ తర్వాత పైడిరాజు మృతదేహాన్ని నూకరాజు తీసుకువచ్చిన టూ వీలర్ మీద మధ్యలో పెట్టుకుని.. విశాలాక్షి లాగర్ లోని తమ అద్దె గదికి తరలించారు.

ఇక ఆ తర్వాత తెల్లవారుజామున నూకరాజు ఓ అంబులెన్స్ కు కాల్ చేశాడు.  తన స్నేహితుడికి హఠాత్తుగా ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి  తీసుకెళ్లాలని తెలిపాడు. అక్కడికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది పైడిరాజును పరీక్షించి.. అతను చనిపోయాడని చెప్పారు. ఈ క్రమంలో నూకరాజు..   బాధ పడుతున్నట్టు నాటకం ఆడుతూ అతనికి ఎవరూ లేరని చెప్పి.. అంబులెన్స్ సిబ్బందిని నమ్మించాడు. అదే వాహనంలో  పైడిరాజు మృతదేహాన్ని పెద్ద జాలరిపేట సమీపంలోని వాసవానిపాలెం స్మశాన వాటికకు తరలించారు. 

అక్కడ అనాధ శవంగా దహనం చేశారు. ఆ బూడిదని సముద్రంలో కలిపేసి ఇంటికి వచ్చేశాడు. ఇదంతా అయిన తర్వాత జ్యోతి నింపాదిగా డిసెంబర్ 30న తన భర్త కనిపించడం లేదని బీమ్లి పోలీసులను ఆశ్రయించింది. అయితే మృతుడి సోదరుడు జ్యోతి ప్రవర్తన పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆరాతీయగా ఆమె సిబిఐ ఆఫీసులో పనిచేయడం లేదని తేలింది. దీంతో పోలీసులకు కూడా ఆమె మీద అనుమానం బలపడింది.ఆ కోణంలో దర్యాప్తు జరపగా..  ఆమె ఫోన్ కాల్స్ ఆధారంగా నూకరాజుతో వివాహేతర సంబంధం బయటపడింది. వెంటనే నిందితుల ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. పైడిరాజును హత్య చేసినట్లు ఈ విచారణలో నిందితులు అంగీకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios