Asianet News TeluguAsianet News Telugu

డేటా లీక్ కేసులో కీలక మలుపు : 66 కోట్ల మంది డేటా లీక్, కీలక సూత్రధారి అరెస్ట్.. 4.5 లక్షల మంది ఉద్యోగులతో దందా

దేశంలోని 66 కోట్ల మంది డేటాను లీక్ చేసిన ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్ అనే వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా చోరీ కోసం 6 మెట్రోపాలిటీన్ నగరాల్లో 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాడు వినయ్. 

vinay bhardwaj arrested by cyberabad police in data leak case
Author
First Published Apr 1, 2023, 4:56 PM IST

సైబరాబాద్ డేటా లీక్ కేసు కీలక మలుపు తిరిగింది. దేశంలోని 66 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 24 రాష్ట్రాల్లోని 8 మెట్రోపాలిటిన్ నగరాల్లలో డేటా చోరీ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. దీనికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న వినయ్ భరద్వాజ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా చోరీ కోసం 6 మెట్రోపాలిటీన్ నగరాల్లో 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాడు వినయ్.

డీమార్ట్, నీట్, పాన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, జీఎస్టీ, ఆర్టీవో, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, బుక్ మై షో, ఇన్‌స్టాగ్రామ్, జోమాటో, పాలసీ బజార్, బైజూస్ , వేదాంత , ఇన్‌కం ట్యాక్స్, డిఫెన్స్ అధికారులతో పాటు 9, 10, 11, 12 తరగతుల విద్యార్థుల డేటాను ఈ గ్యాంగ్ చోరీ చేసినట్లుగా గుర్తించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 4 కోట్ల మంది డేటాను చోరీ చేయగా.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 2.5 కోట్ల మంది, హైదరాబాద్ నగరానికి చెందిన కోటి మంది డేటాను వినయ్ భరద్వాజ్ చోరీ చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. 

ALso REad: డేటా లీక్ కేసు.. వెలుగులోకి మనీలాండరింగ్ కోణం, రంగంలోకి ఈడీ అధికారులు

కాగా.. సైబరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చిన డేటా లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వర్గాలు సైతం దర్యాప్తులో భాగమయ్యాయి. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగింది. ఈ కేసులోని మనీలాండరింగ్ కోణంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మూడు రోజులుగా ప్రశ్నిస్తున్నారు. వీరి వద్ద దేశంలోని 16.8 కోట్ల మందికి సంబంధించిన బ్యాంక్, పాన్‌కార్డ్, డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలున్నట్లు పోలీసులు గుర్తించారు. డేటా చోరీలో బ్యాంక్, కాల్ సెంటర్లలోని ఉన్నత స్థాయి ఉద్యోగుల పాత్ర వున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విలువైన డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లినట్లుగా గుర్తించారు. ఆఫీసులకు ముందుగా వచ్చి పెన్‌డ్రైవ్‌లోకి డేటా బదిలీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ముంబై, హైదరాబాద్, ఢిల్లీకి చెందిన ఉద్యోగులే సూత్రధారులని సమాచారం. జస్ట్ డయల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల నుంచి డేటా చోరీ  అయినట్లుగా గుర్తించారు. దీంతో బ్యాంక్‌లతో పాటు జస్ట్ డయల్‌కి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అలాగే మరోసారి సైబరాబాద్ పోలీసులత భేటీ అయ్యాయి కేంద్ర వర్గాలు. డిఫెన్స్, నేవీ, ఆర్మీ ఆఫీసర్ల డేటా లీక్‌పై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. విదేశాలకు డేటా ఏమైనా లీక్ చేశారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. డేటా లీక్‌లో రెహ్మాన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios