Asianet News TeluguAsianet News Telugu

వామనరావు దంపతుల హత్య కేసు: వసంతరావు అరెస్టు, కుంట శ్రీనుతో లింక్

లాయర్ దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. హత్యకు కుంట శ్రీనును ప్రోత్సహించాడనే ఆరోపణపై వెల్ది వసంతరావును అరెస్టు చేశారు.

Vaman rao Killing: Veldi Vasanth rao arrested
Author
Peddapalli, First Published Mar 19, 2021, 8:12 AM IST

పెద్దపల్లి: న్యాయవాదులు గట్టు వామనరావు, పివి నాగమణి దంపతుల హత్య కేసులో నిందితుడు వెల్ది వసంత రావును పోలీసులు అరెస్టు చేశఆరు. వెల్ది వసంతరావు  ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ డీఈఈగా కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసి 2018 సంవత్సరంలో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం కరీంనగర్ లోని ఉంటున్నాడు. తన స్వస్థలం అయిన గుంజపడుగు గ్రామంలో అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్న సమయంలో  కుంట శ్రీనుతో పరిచయం ఏర్పడింది 

కుంట  శ్రీను  గుంజపడుగు గ్రామంలో తను నిర్మిస్తున్న పెద్దమ్మ గుడి, అతని ఇల్లు  అక్రమనిర్మాణo అని గ్రామపంచాయతీ వాళ్ళ చేత గట్టు వామన్ రావు నోటీసులు ఇప్పించాడని వెల్ది వసంత రావుతో చెప్పుకొని బాధ పడేవాడు. గుంజపడుగు  గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాలు అందరూ కలిసి సెప్టెంబరు 24 2020 న వెల్ది వసంత రావుని  బ్రాహ్మణ కుల సంఘానికి అధ్యక్షుని గా ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు 

అప్పటి నుండి గుంజపడుగు  గ్రామానికి పని మీద బ్రహ్మణ కులస్తులు ఎవరైనా వచ్చినట్లయితే వారు ఉండటానికి వసతిని ఏర్పాటు చేసి దానిని చూసుకోవడానికి తన గ్రామస్తుడైన ప్రదీప్ కుమార్ ని ఇoచార్జ్ గా నియమించాడు .

జనవరి 04 తారీఖు నాడు బ్రాహ్మణ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించడానికి పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ ని, మంథని ఎమ్మెల్యేని ఆహ్వానించారు. కానీ ఈ కార్యక్రమానికి  ఎమ్మెల్యే హాజరు కాలేదు.   

ఆ తరువాత  గట్టు వామన్ రావు వసంత రావుకి  ఫోన్ చేసి కుల సంఘం బిల్డింగ్ లో ఉంటున్న ప్రదీప్ ప్రవర్తన సరిగా ఉండటం లేదని  అతను ఆ భవనంలో మందు తాగడం సిగరెట్లు తాగించడం లాంటివి చేస్తున్నాడని అతనిని ఆ పనిలో నుండి తీసివేయాలని చెప్పాడు.  

జనవరి 24 తేది  నాడు బ్రాహ్మణ సంఘం వారు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నారు. దానికి సుమారు 40 మంది హాజరయ్యారు. ఆ రోజు వామన్ రావు అతని అల్లుడు శ్రీనాథ్ ఫోన్ కు వీడియో కాల్ చేసి తనతో కొత్త వాట్సప్ గ్రూప్ ఎందుకు పెట్టారు, సంఘం క్యాలెండర్ లో నా అనుమతి లేకుండా నా ఫోటో ఎలా పెట్టారని మీ అందరిపైన కోర్టు లో కేసులు వేస్తానని బెదిరించాడు. 

జనవరి 26-2021 రోజున జెండావందనం అయిపోయిన తర్వాత బ్రాహ్మణ సంఘం భవనం ఇంచార్జి అయినా రేగళ్ళ ప్రదీప్ కుమార్ ని గుంజపడుగు గ్రామస్తులైన గట్టు కిషన్ రావు, గట్టు ఇంద్ర శేఖర్, బుడంగారి శ్రీనాథ్, వెల్ది సుధాకర్ కలిసి దాడి చేసి కొట్టారు. వెల్ది వసంత రావు ఇట్టి విషయాన్ని బ్రాహ్మణ సంఘం సెక్రటరీ అయినా గట్టు విజయ్ కుమార్ ని పిలిచి ప్రదీప్ కుమార్ ని మంథని పోలీస్ స్టేషన్ కి  తీసుకెళ్ళి గట్టు వామన రావు  తండ్రి అయిన కిషన్ రావు, చంద్రశేఖరరావు, బుడంగారి శ్రీనాథ్, వెల్ది సుధాకర్ లపై మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఇది మనసులో పెట్టుకొని గట్టు వామన్ రావు, వెల్ది వసంత్ రావు పై జనవరి 29 రోజున  సీపీకి కిషన్ రావు, చంద్రశేఖరరావు చేత పిర్యాదు చేయించారు.

29-01-2021 రోజున వెల్ది వసంత రావు మరియు వారి కొడుకు అవినీతి బాగోతం బయట పెడతామని, ఏసీబీ వారికి ఫిర్యాదు చేసి వారిపై కేసులు పెడతామని గట్టు వామన్ రావు వాట్సాప్ గ్రూపులో సందేశాలు పెట్టాడు.

ఈ సందేశం చూసిన తర్వాత వెల్ది వసంత రావు కుంట శ్రీనుకి ఆ రోజే పలుమార్లు ఫోన్ చేసి వామన్ రావు తనను మానసికంగా బాగా ఇబ్బందులకు గురి  చేస్తున్నాడని, అతన్ని ఏదైనా చేయాలని చెప్పాడు.

అప్పుడు కుంట శ్రీను వెల్ది వసంతరావు తో వామన్ రావు తమను ఏవిధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడో తాము కూడా అతన్ని ఇబ్బందులు పెడదామని చెప్పి బ్రహ్మణ సంఘం తరుపున సహకారాన్ని కోరాడు.  

దానికి సంబంధించి రామస్వామి గోపాలస్వామి గుడి పాత కమిటి చైర్మన్ గట్టు ఇంద్ర శేఖర్ ని తొలగించి కొత్త కమిటి ఎన్నుకొవటానికి సహకారాన్ని అందించాలని వసంత రావుని కుంట శ్రీను కోరాడు 

07-02-2021 రోజున  రామ స్వామి గోపాల స్వామి పాత కమిటీ రద్దు చేస్తూ నూతన కమిటీ ఏర్పాటులో వెల్ది వసంతరావు ప్రధాన పాత్ర పోషించాడని  గట్టు వామన్ రావు వెల్ది వసంతరావుపై కోపం పెంచుకున్నాడు.

అదే రోజు వామన్ రావు వెల్ది వసంత రావు బంధువు అయిన డాక్టర్ రామ్ మోహన్ రావుని గట్టు వామన్ రావు హైదరాబాద్ లోని తన ఇంటికి పిలిపించుకుని వసంతరావు ను చంపేస్తానని బెదిరించాడు. ఇట్టి విషయాన్ని మోహన్ రావు వెల్ది వసంత రావు  కొడుకైన రామకృష్ణ కార్తిక్ ఫోన్ చేసి చెప్పగా తన కొడుకు ద్వారా ఇట్టి విషయం తెలుసుకొని వసంత రావు, కుంట శ్రీనుకి ఫోన్ చేసి బాధపడ్డాడు 

వామన్ రావుని ఏదైనా చేసి లేపెయ్యేలని  కుంట శ్రీనును కోరగాదానికి కుంట శ్రీను వామన్ రావు ని అవకాసం చూసి లేపేస్తా దానికి కొంతమందితో ప్లాన్ చేశానని కుంట శ్రీను చెప్పాడు .వామన్ రావు పీడవిరగాడయ్యేలా చేస్తే దానికి అన్ని రకాల సహాయం చేస్తానని వసంత రావు, కుంట శ్రీను ను ప్రోత్సహించాడు. ఈ విధంగా వామన్ రావు దంపతుల హత్య కేసులో వెల్ది వసంత రావు భాగస్వామి అయ్యాడు. 

ఈ నేపథ్యంలో గట్టు వామనరావు, పివి నాగమణి దంపతుల హత్య కేసులో కుంట శ్రీనుని ప్రోత్సహించిన వెల్ది వసంత రావుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios