Asianet News TeluguAsianet News Telugu

శిల్పా చౌదరికి షాక్: బెయిల్ తిరస్కరించిన కోర్టు, పోలీస్ కస్టడీకి మరోసారి అనుమతి

కిట్టీ పార్టీల పేరుతో ప్రముఖుల నుండి డబ్బులు వసూలు చేసిన కేసులో అరెస్టైన శిల్పా చౌదరికి ఉప్పర్ పల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. సోమవారం నాడు ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు.

Upparpally Court  denies   Shilpa Chaudhary Bail petition
Author
Hyde Park, First Published Dec 13, 2021, 2:48 PM IST


హైదరాబాద్: కిట్టీ పార్టీల పేరుతో పలువురు సీనీ ప్రముఖులు, వీఐపీలు, పోలీసు అధికారులను మోసం చేసిన కేసులో అరెస్టైన Shilpa chowdary కి Upparpally court  సోమవారం నాడు బెయిల్ నిరాకరించింది.  దీంతో ఆమెను నార్సింగి పోలీసులు chanchalguda jail మహిళా జైలుకు తరలించారు. మరో వైపు శిల్పా చౌదరిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గత వారంలో నార్సింగి పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పాటు శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు విచారించారు.

అయితే మూడు రోజుల్లో శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవులు రావడంతో బ్యాంకు లావాదేవీల వివరాలు తీసుకొనేందుకు పోలీసులకు ఇబ్బంది ఏర్పడింది. దీంతో మరోసారి పోలీసులు కోర్టులో రెండు రోజుల పాటు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఒక్కరోజు మాత్రమే శిల్పా చౌదరిని కస్టడీకి ఇస్తూ అనుమతిని ఇచ్చింది. ఈ నెల 2వ తేదీన కూడా ఉప్పర్‌పల్లి కోర్టులో శిల్పా చౌదరి, ఆమె భర్త బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే శిల్పా చౌదరి భర్తకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే శిల్పా చౌదరికి మాత్రం బెయిల్ ఇవ్వలేదు కోర్టు.

also read:Shilpa Chowdary: రోజుకో మలుపు.. రూ. 7 కోట్లు తిరిగి ఇచ్చేస్తా.. విచారణలో ఆ ముగ్గురి పేర్లు చెప్పిన శిల్పా చౌదర

ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని వారి నుండి డబ్బులు వసూలు చేసేందుకు కిట్టీ పార్టీలను ఏర్పాటు చేసేదని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయాలను వసూలు చేసిందని ఆమెపై పలువురు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.  మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉన్న శిల్పా చౌదరి పోలీసులకు చుక్కలు చూపించింది. పోలీసుల ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదని సమాచారం.   ఎన్నారై ప్రతాప్ రెడ్డి, మల్లారెడ్డి, రాధికారెడ్డిల నుండి తనకు డబ్బులు రావాల్సి ఉందని శిల్పా చౌదరి పోలీసుల విచారణలో తెలిపిందని సమాచారం.శిల్పా చౌదరి చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎన్నారై ప్రతాప్ రెడ్డికి పోలీసులు ఫోన్ చేశారు. అయితే ఎన్నారై ప్రతాప్ రెడ్డి మాత్రం పోలీసులకు భిన్నమైన సమాధానం చెప్పారని తెలుస్తోంది.

తనకే శిల్పా చౌదరి డబ్బులు ఇవ్వాలని  చెప్పారని తెలుస్తోంది.పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.  ఆ తర్వాత పలువురు వరుసగా శిల్పా చౌదరి ద్వారా తాము మోసపోయినట్టుగా పోలీసులను ఆశ్రయించారు. రోజుకొకరు శిల్పా చౌదరి తమ వద్ద నుండి డబ్బులు తీసుకొని మోసపోయామని ఫిర్యాదులు చేశారు.మరో వైపు తనకు డబ్బులు ఇచ్చిన వారు తనకు డబ్బులు తిరిగి ఇస్తే బాధితులకు డబ్బులు ఇస్తామని శిల్పా చౌదరి పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం.శిల్పా చౌదరి పలువురు సినీ హీరోల కుటుంబాలను కూడా మోసం చేసినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ మేరకు సినీ ప్రముఖులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 


 

 

Follow Us:
Download App:
  • android
  • ios