Asianet News TeluguAsianet News Telugu

ఉప్పల్ జంట హత్యల కేసు.. ఘ‌ట‌న‌లో కిరాయి హంత‌కుల పాత్ర.. ?

ఉప్పల్ జంట హత్య ఘటనలో కిరాయి హంతకుల పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసులు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

Uppal twin murder case.. The role of hired killers in the incident.. ?
Author
First Published Oct 17, 2022, 1:39 PM IST

హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ లో వెలుగులోకి వెచ్చిన జంట హత్య ఘ‌ట‌న‌లో కిరాయి హంతకుల పాత్ర ఉన్నట్టు  రాచ‌కొండ పోలీసులు అనుమానిస్తున్నారు. హ‌త్య జ‌రిగి ఒక రోజు గ‌డిచినా ఈ విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. దారుణ హ‌త్య‌కు గురైన న‌రసింహ మూర్తి (78) ఆయ‌న కుమారుడు శ్రీనివాస్ (35)కి త‌న తోబుట్టువుల‌తో విభేదాలు ఉన్నాయ‌ని రాచ‌కొండ పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయ‌ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనంలో నివేదించింది.

ఆఫ్ఘనిస్తాన్‌ మహిళకు బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపే శిక్ష.. ముందే ఆత్మహత్య చేసుకున్న బాధితురాలు

“ జంట హత్యలో నరసింహ మూర్తి సోదరి, సోదరుడి పాత్రపై బాధితుల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనలో వారి ప్రత్యక్ష ప్ర‌మేయం ఉన్న‌ట్టు కనుగొనబడలేదు. ఇందులో కిరాయి హంత‌కులు నిమ‌గ్నమై ఉండ‌వ‌చ్చు. బాధితులకు మరెవరితోనైనా శత్రుత్వం ఉందో లేదో తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది ” అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు: ఓట్లు వేసిన రాహుల్ గాంధీ, ఖర్గే.. శశి థరూర్ కీలక వ్యాఖ్యలు

‘‘ బాధితులు, అనుమానితుల మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి. వివిధ కోర్టులలో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కౌంటర్ కేసులు ఉన్న టైటిల్ వివాదం కాబట్టి ఈ కేసులపై మాకు స్ప‌ష్ట‌త లేదు. ఓ స‌మ‌స్య‌లో ఆస్తి ఇప్ప‌టికే విక్రయించబడిందని కూడా కనుగొనబడింది” అని విచారణలో పాల్గొన్న ఒక అధికారి తెలిపినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. నరసింహ తన ఇంట్లో కూర్చొని ఉండగా.. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయ‌న ముఖాన్ని క‌ప్పి ఉంచి న‌రికి చంపారు. తండ్రి అరుపులు ఉన్న కుమారుడు శ్రీనివాస్ రావు ప‌రిగెత్తుకు వ‌చ్చాడు. దీంతో ఆయ‌న‌ను కూడా దుండుగులు హ‌త్య చేశారు. కాగా.. ఈ  జంట హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించి పట్టుకునేందుకు రాచకొండ పోలీసులు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios