Asianet News TeluguAsianet News Telugu

జూలై 1న తెలంగాణ గ్రూప్-4 పరీక్ష: ధరఖాస్తుకు ఫిబ్రవరి 3 చివరి తేదీ

తెలంగాణలో గ్రూప్-4  పరీక్షను  ఈ ఏడాది జూలై  1వ తేదీన నిర్వహించనున్నారు.ఈ మేరకు  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది

TSPSC  To Conduct   Group-4 Exam  on July  01, 2023
Author
First Published Feb 2, 2023, 8:34 PM IST


హైదరాబాద్: ఈ ఏడాది జూలై  1వ తేదీన  టీఎస్‌పీఎస్ సీ  గ్రూప్ -4 ;పరీక్ష నిర్వహించనున్నట్టుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.  రాష్టంలో  8,180 ఉద్యోగాలను  గ్రూప్ -4 కింద భర్తీ చేసేందుకు  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  చర్యలు చేపట్టింది.  గత ఏడాది  డిసెంబర్ మాసంలో గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  నోటిఫికేషన్ జారీ చేసింది.  ఈ ఉద్యోగాల కోసం  పెద్ద ఎత్తున అభ్యర్ధులు ధరఖాస్తులు చేసుకున్నారు.  ఇంకా డిమాండ్  ఉండడంతో  ఈ నెల  3వ తేదీ వరకు  ధరఖాస్తు  చేసుకొనేందుకు  గడువును ఇచ్చింది  టీఎస్‌పీఎస్ సీ.  వాస్తవానికి గత నెల  30వ తేదీతోనే గడువును ముగించారు. కానీ   అభ్యర్ధుల డిమాండ్  నేపథ్యంలో  మరోసారి గడువును పెంచారు. గ్రూప్ -4  ఉద్యోగాల కోసం  ఇప్పటికే  9 లక్షల మందికి పైగా అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకున్నారు.  గడువు పెంచడంతో  ఇంకా ధరఖాస్తుల సంఖ్య పెరగనుంది.  ఈ ఏడాది జూలై  1వ తేదీన  ఉదయం  10 గంటలనుండి  పేపర్ -1, మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి పేపర్ -2 ను నిర్వహించనున్నారు. 

మరో వైపు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల తేదీలను  రెండు రోజుల క్రితం  టీఎస్ పీఎస్ సీ ప్రకటించింది.  జూన్ 5 నుండి  జూన్  12 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios