పేపర్ లీక్ .. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం
పేపర్ లీక్ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జరిగిన పరీక్షలు సహా మొత్తం గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
పేపర్ లీక్ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జరిగిన పరీక్షలు సహా మొత్తం గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 11న మళ్లీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో పరీక్షలు రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఏఈఈ, డీఏవో పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలావుండగా.. పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. నిందితుడు ప్రవీణ్ పెన్డ్రైవ్లో 5 ప్రశ్నాపత్రాలు గుర్తించింది సిట్. ఇప్పటికే ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్షను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. ఈ క్రమంలో మరో 4 విభాగాల పరీక్షా పత్రాలు మార్చాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రవీణ్కు 103 మార్కులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రవీణ్ రాసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు టీఎస్పీఎస్సీ.
Also Read : పేపర్ లీక్.. టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం, ఏప్రిల్లో జరిగే పరీక్షల ప్రశ్నాపత్రాలు మార్పు
ఇకపోతే.. పేపర్ లీక్ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రవీణ్ 5 పేపర్లను కంప్యూటర్ నుంచి కొట్టేసినట్లుగా పోలీసులు తేల్చారు. టీఎస్పీఎస్సీ అధికారులతో సిట్ చీఫ్ భేటీ అయ్యారు. పేపర్ లీక్ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. లక్ష్మీ నుంచి ప్రవీణ్ పాస్వర్డ్ చోరీ చేయడంపై సిట్ చీఫ్ వివరాలు సేకరిస్తున్నారు. ప్రవీణ్కు లబ్ధి చేకూర్చేందుకు గాను కంప్యూటర్ LANలో మార్పులు చేశాడు రాజశేఖర్. రాజశేఖర్ సాయంతో పేపర్లు కొట్టేశాడు ప్రవీణ్. అనంతరం తన దగ్గరున్న పెన్డ్రైవ్లో పేపర్లు సేవ్ చేసుకున్నాడు ప్రవీణ్ కుమార్.
5న జరిగిన పరీక్షతో పాటు , మరో 4 పేపర్లు కొట్టేశాడు ప్రవీణ్. టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ , గ్రౌండ్ వాటర్ ఇన్స్పెక్టర్ పోస్టుల పేపర్లను తన దగ్గర పెట్టుకున్నాడు ప్రవీణ్. సమయం చూసి పేపర్లను విక్రయించేందుకు ప్రవీణ్ ప్లాన్ చేశాడు. భవిష్యత్తులో జరిగే పరీక్షా పత్రాలు ఇస్తానని రేణుకకు ప్రవీణ్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అభ్యర్ధులను వెతికి బేరమాడి పెట్టాలని రేణుకకు చెప్పాడు ప్రవీణ్.