మహిళా రిజర్వేషన్ బిల్లును  పార్లమెంట్ లో  ప్రవేశ పెట్టాలని  కోరతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద  కవిత  నేతృత్వంలో  ఇవాళ దీక్ష  ప్రారంభమైంది. 

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ ను ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని కోరుతూ భారత జాగృతి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం నాడు దీక్ష ప్రారంభమైంది. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించారు. 

భారత జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, మహిళా ప్రజా ప్రతినిధులు , బీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు ఈ దీక్షలో పాల్గొన్నారు.దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలకు చెందిన ఎంపీలు కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు.