Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో గందరగోళం.. వారికి నోటీసుల్లో ఒకే ఫోన్ నంబర్.. అదే కారణమా

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌లతో పాటుకు సిట్ నోటీసులు జారీ చేసింది.

TRS MLAs poaching case Sit Notices to BJP BL Santhosh and advocate Srinivas
Author
First Published Nov 19, 2022, 10:23 AM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌లతో పాటుకు సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని కార్యాలయంలో నవంబర్ 21న ఉదయం 10.30 గంటలకు సిట్ ఎదుట హాజరుకావాలని 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసింది. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని స్పస్టం చేసింది. 

అయితే ఈ నోటీసుల్లో గందరగోళం చోటుచేసుకున్నట్టుగా ప్రచారం సాగినప్పటికీ అలాంటిదేమి లేదని తెలుస్తోంది. బీఎల్ సంతోష్‌తో మరికొందరికి జారీ చేసిన నోటీసుల్లో విచారణకు వచ్చేటప్పుడు 9449831415 నంబరు సిమ్‌తోపాటు ఐఎంఈఐ నంబరు 353846108969790తో కూడిన సెల్‌ఫోన్‌ను వెంట తీసుకురావాలని సూచించింది. అయితే ఒకే నెంబర్ తీసుకురావాలని పలువురికి నోటీసుల్లో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఓ సంభాషణ నిర్దిష్ట నెంబర్ నుంచి.. కాన్ఫరెన్స్ కాల్ చేసిన నేపథ్యంలో.. నోటీసుల్లో అందరికి అదే నెంబర్‌ను పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఆ నెంబర్ ఎవరి వద్ద ఉంటే వారు తీసుకురావాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఆ విధంగా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.  

ఇక, అంతేకాకుండా.. నోటీసులు అందిన తర్వాత మొబైల్స్‌లోని డేటాను ట్యాంపర్ చేయవద్దని విచారణ అధికారి హోదాలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ పి గంగాధర్ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాంటి ప్రయత్నం చేస్తే ప్రాసిక్యూషన్‌కు గురవుతామని హెచ్చరించారు. విచారణాధికారులకు సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లరాదని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులు జారీచేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది. కేసును పర్యవేక్షిస్తున్న సింగిల్ జడ్జి అనుమతి పొందిన తర్వాతే సిట్ నోటీసులు జారీ చేయాలని పేర్కొంటూ.. నోటీసులపై స్టే విధించాలని బీజేపీ కోరింది. కుట్రలో భాగంగానే ఆయనకు 41ఏ కింద నోటీసులు ఇచ్చారని ఆరోపించింది. బీఎల్ సంతోష్, లాయర్ శ్రీనివాస్కు నోటీసుల్లో ఒకే సెల్ నెంబర్ పెట్టారని చెప్పారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వాళ్లను వేధించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios