ఎస్సై పై దాడికి దిగిన ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు
ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే.. ఈయన విధుల్లో ఉన్న పోలీసుల.. ఇద్దరికీ ఇద్దరు ఏ మాత్రం తగ్గలే.. దీంతో అక్కడ సీన్ అంతా రచ్చ రచ్చ అయింది.
ఇంతకీ విషయం ఏంటంటే...
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు ఓ బైక్ మీద త్రిబుల్ రైడ్ చేస్తున్నారు. వారిని ఆపిన స్థానిక ఎస్సై ఆంజనేయులు ఫైన్ కట్టాలని వారికి సూచించాడు. అయితే తాము ఎమ్మేల్యే అనుచరులమని పైసా కూడా కట్టం అని తేల్చిచెప్పారు.
ఇంతలో అక్కడి వచ్చిన ఎమ్మెల్యే ఆయన అనుచరులు ఎస్సై తో వాగ్వివాదానికి దిగారు. ఎస్సై కూడా ఏ మాత్రం తగ్గలేదు. నీవు మనిషివీనే అంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఎస్సై పై దాడికి దిగారు.
