Asianet News TeluguAsianet News Telugu

సినీ నిర్మాత బండ్ల గణేష్‌తో రేవంత్ రెడ్డి భేటీ.. ఏం జరుగుతోంది..?

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. దీనిలో భాగంగా పార్టీకి దూరంగా వుంటున్న వారిని యాక్టీవ్ చేయడంతో పాటు కొత్త చేరికలను ఆయన ప్రొత్సహిస్తున్నారు. దీనిలో భాగంగా సినీ నిర్మాత బండ్ల గణేష్‌తో రేవంత్ భేటీ అయ్యారు. 

tpcc chief revanth reddy meets producer bandla ganesh
Author
Hyderabad, First Published Jun 24, 2022, 9:51 PM IST

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌తో (bandla ganesh) టీపీసీసీ (tpcc) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (revanth reddy) భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం బండ్ల గణేశ్‌ నివాసానికి వెళ్లిన రేవంత్‌ దాదాపు 2 గంటలపాటు ఆయనతో చర్చించారు. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాంగ్రెస్‌లోనే వున్నప్పటికీ గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న గణేశ్‌‌ను .. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది.   

ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు బండ్ల గణేశ్‌ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసక్తి చూపారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ (congress party) టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. అప్పటి నుంచి బండ్ల గణేష్ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు రాజకీయాలకు సంబంధించిన అంశాలపై స్పందిస్తూ.. ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు . కానీ, ఎక్కడా రాజకీయ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనలేదు. దీంతో బండ్ల గణేశ్‌‌ను యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ALso Read:బండ్ల గణేష్ చెప్పిన పూరి జీవితంలోని ఆ వ్యాంప్ ఎవరు?... కలకలం రేపుతున్న కామెంట్స్!

ఇకపోతే.. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి లేటెస్ట్ మూవీ చోర్ బజార్. దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 24న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ విడుదలైంది. ఈ నేపథ్యంలో చోర్ బజార్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన బండ్ల కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన వస్తూ వస్తూనే పూరి వైఫ్ లావణ్య గురించి మాట్లాడారు. మా వదిన అంటూ ఆమె గురించి చాలా ఉన్నతంగా మాట్లాడారు. లావణ్య వదిన శ్రీజాతిలోనే ఉత్తమురాలు. ఒక మంచి అక్క, భార్య, కోడలు, వదిన, తల్లి ఆమెలో ఉన్నారు. నేను సీతమ్మవారిని చూడలేదు కానీ సీతమ్మ అంత సహనం లావణ్య గారిలో ఉంది. పాండవుల తల్లి కుంతీ అంత మహోన్నత వ్యక్తి లావణ్య అంటూ కొనియాడారు.

పూరి స్టార్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు లావణ్య ఆయన జీవితంలోకి  రాలేదు. జేబులో వంద రూపాయలు కూడా లేనప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  జీవితంలోకి ర్యాంప్ లు వ్యాంప్ లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. భార్య శాశ్వతం. లావణ్య గారిని జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పూరి అన్న, ఆకాష్ పై ఉంది అన్నారు. ఈ మాటలకు లావణ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె ఎమోషనల్ అయ్యారు.

లావణ్యను పొగిడే క్రమంలో బండ్ల గణేష్ ఉపయోగించిన ఆ పదం హాట్ టాపిక్ అవుతుంది. పూరి జీవితంలో బండ్ల గణేష్ చెప్పిన ర్యాంప్ వ్యాంప్ ఎవరనే చర్చ మొదలైంది. నేరుగా ఈ మాట హీరోయిన్ ఛార్మికి తగులుతుంది. ఆమెను ఉద్దేశించే బండ్ల ఆ పదాలు వాడారని కొందరు బహిరంగంగా అంటున్నారు. కొన్నాళ్లుగా పూరి, ఛార్మి కలిసి ఉంటున్నారు. నటన మానేసిన ఛార్మి పూరి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios