Asianet News TeluguAsianet News Telugu

బట్టలు ఉతుకుతూ నీటి గుంటలో పడి ముగ్గురు మృతి

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంటలో పడి ముగ్గురు మరణించారు.

three persons fell into quarry pond in medchal district
Author
Medchal, First Published Jun 2, 2019, 4:04 PM IST

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంటలో పడి ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం.. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలోని బాలయ్య నగర్‌లోని బంధువుల ఇంట్లో వివాహానికి వచ్చింది.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్థానికంగా ఉన్న క్వారీ వద్ద నీటి గుంతలో దుస్తులు ఉతుకేందుకు వెళ్ళారు. ఈ సమయంలో ముగ్గురు అదుపు తప్పి క్వారీలో పడి మరణించారు. మృతులను ఐలమ్మ (65), అనిత (30), యశ్వంత్‌ (10) గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios