వరంగల్ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ఆదివారం అర్థరాత్రి సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఒకరు గాయపడ్డారు. వరంగల్ జిల్లాలోని కంఠాత్మకూరు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వరంగల్: వరంగల్ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ఆదివారం అర్థరాత్రి సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఒకరు గాయపడ్డారు. వరంగల్ జిల్లాలోని కంఠాత్మకూరు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. 48 గంటలు గడిస్తే గానీ అతని పరిస్థితిపై చెప్పలేమని వైద్యులు అంటున్నారు. 

పేలుడు ధాటికి ఇల్లు కుప్ప కూలింది. సిలిండర్ పేలడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబంతో గొడవలున్నాయని తెలుస్తోంది. గొడవల కారణంగా ఎవరైనా సిలిండర్ పేలుడుకు పూనుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.