గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు  కోరుతున్నారు.  టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు గురువారంనాడు టీఎస్‌పీఎస్‌సీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. గ్రూప్ -2 పరీక్ష రాసే అభ్యర్థులకు ఎన్ఎస్‌యూఐ, ఓయూ విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. టీఎస్‌పీఎస్‌సీ వరకు ర్యాలీగా వచ్చిన గ్రూప్-2 అభ్యర్థులు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.

 అయితే గ్రూప్-2 అభ్యర్థులను టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలోనికి వెళ్లేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు గ్రూప్-2 పరీక్ష రాసే అభ్యర్థులకు తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ మద్దతిచ్చారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ విషయమై అసెంబ్లీలో కోరినా కూడ ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించాలని టీఎస్‌పీఎస్‌సీ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది డిసెంబర్ మాసంలో ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్‌సీ జారీ చేసింది. ప్రభుత్వ రంగంలోని వివిధ విభాగాల్లోని 783 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు టీఎస్‌పీసీఎస్ గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించనుంది. అయితే ఇదే నెలలో గురుకుల, జూనియర్ లెక్చరర్ పరీక్షలున్నాయి. దీంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకే నెలలో మూడు ముఖ్యమైన పరీక్షలు ఉండడంతో ఇబ్బందులున్నాయని వారు చెబుతున్నారు.

also read:గ్రూప్-2 పరీక్ష వాయిదాకోరుతూ విద్యార్థుల ర్యాలీ, అరెస్ట్: ఓయూలో ఉద్రిక్తత

గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఓయూలో ఆందోళనకు దిగారు. ఇవాళ టీఎస్‌పీఎస్‌సీ వద్ద ఆందోళనకు దిగారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద బైఠాయించారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

ఆందోళన చేస్తున్న వారిలో ఆరుగురిని చర్చలకు టీఎస్‌పీఎస్‌సీ పిలిచారు. కనీసం మూడు మాసాల పాటు పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. అయితే ఈ విషయమై టీఎస్‌పీఎస్‌సీ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందోననే ఉత్కంఠ నెలకొంది. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలను వాయిదా వేస్తే పరీక్షలు నిర్వహించేందుకు రానున్న రోజుల్లో కష్టమనే అభిప్రాయంతో టీఎస్‌పీఎస్‌సీ ఉందనే ప్రచారం సాగుతుంది.