తల్లీ కొడుకు మృతి
నిజామాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తల్లితోపాటు, రెండేళ్ల కొడుకు అనుమానాస్పద మృతి జిల్లాలో కలకలం రేపింది. తన రెండేళ్ల కొడుకుకు విషమిచ్చి తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందని స్థానికుల నుంచి సమాచారం తెలుస్తోంది.
Add Asianetnews Telugu as a Preferred Source

"
జిల్లాలోని దర్పల్లి మండలం పల్లె చెరువు తండా లో ఈ సంఘటన జరిగింది. అయితే ఆమె అత్త, తోటి కోడలు కలిసి హత్య చేశారంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. అత్త తోటి కోడలి పై దాడి చేసి చితక బాదారు. ఆగ్రహంతో అత్త నివసించే ఇంటికి నిప్పంటించారు.
