తెలంగాణలో పదో తగరతి పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
తెలంగాణలో పదో తగరతి పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10వ తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. పదో తరగతి పరీక్షలు ముగిసిన మరుసటి రోజు (మే 26) నుంచి జూన్ 13వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు.
గతంలో ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈసారి కేవలం ఆరు సబ్జెక్టులకు ఆరు పరీక్షలు నిర్వహించనున్నారు. నాలుగు ఎఫ్ఏ (ఫార్మెటివ్ అసెస్మెంట్) టెస్టులకు గానూ రెండు ఎఫ్ఏ టెస్టులను మాత్రమే నిర్వహించనున్నారు.
మొదటి ఎఫ్ఏను మార్చి 15న, రెండో ఎఫ్ఏ టెస్టును ఏప్రిల్ 15న నిర్వహించనున్నారు. సమ్మేటివ్ అసెస్మెంట్ను మే 7 నుంచి 13వ తేదీ మధ్యలో నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అటు 9, 10వ తరగతుల విద్యార్థుల హాజరు విషయంలో ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వారు స్కూల్కు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపింది. సరిపడా హాజరు శాతం లేనప్పటికీ విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు అనుమతించనున్నారు.
జిల్లాల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు, హైదరాబాద్ జిల్లాలో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.
ఆన్లైన్ క్లాసులైతే పదో తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య, 9వ తరగతి విద్యార్థులకు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య నిర్వహించనున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 23, 2021, 2:42 PM IST