బీఎస్పీ  తెలంగాణ చీఫ్  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్  చేశారు.  గ్రూప్-1 ప్రిలిమ్స్  పరీక్షను రద్దు  చేయాలని  ప్రవీణ్ కుమార్ దీక్షకు దిగాడు.  ఈ దీక్షను  పోలీసులు భగ్నం  చేశారు.  

హైదరాబాద్: బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను శుక్రవారంనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు బీఎస్పీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేసి వదిలిపెట్టిన తర్వాత తన నివాసంలో దీక్షను చేస్తున్నట్టుగా ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

ఈ నెల 12. 15.16 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది. ఈ నెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్షలను రద్దు చేసింది. ఈ ప్రశ్నాపత్రం లీక్ కేసులో పోలీసులు ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును విచారించేందుకు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ప్రశ్నాపత్రం లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు కీలకంగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును టెక్నికల్ ఆధారాలతో విచారణ చేయాలని భావిస్తున్నారు. ప్రవీణ్ ఫోన్ ను పోలీసులు ఎఫ్ఎస్ఎల్ కు పంపారు.