మెదక్ జిల్లాలో అమరుల స్పూర్తి యాత్ర కొనసాగుతోంది. మూడోరోజు జరిగిన ఈ యాత్రలో భాగంగా కౌడిపల్లి దగ్గరలో ఉన్న శేరితండా గిరిజన మహిళలతో కోదండరాం ముచ్చటించారు. ఈ సందర్భంగా  వారు తమ కష్టాలను కోదండరాం కు వివరించారు. సర్కారు పట్టించుకోవడంలేదని ఆరోపించారు గిరిజన మహిళలు.

ఇండ్లు లేవు, బాత్రూములు కూడా లేవు సారూ అని జెఎసి ఛైర్మన్ కోదండరాం కు మొర పెట్టుకున్నారు గిరిజన మహిాళలు.

మెదక్ జిల్లాలో అమరుల స్పూర్తి యాత్ర కొనసాగుతోంది.

మూడోరోజు జరిగిన ఈ యాత్రలో భాగంగా కౌడిపల్లి దగ్గరలో ఉన్న శేరితండా గిరిజన మహిళలతో కోదండరాం ముచ్చటించారు.

ఈ సందర్భంగా వారు తమ కష్టాలను కోదండరాం కు వివరించారు. సర్కారు పట్టించుకోవడంలేదని ఆరోపించారు గిరిజన మహిళలు.

డబుల్ బెడ్రూములు ఏమో కానీ కనీసం తమకు బాత్రూములు కూడా ఇప్పటి వరకు కట్టించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడిప్పుడే బాత్రూములు కడుతున్నారని అన్నారు.