తన పేరుతో వాట్సాప్‌లో వస్తున్న మెసేజ్‌లపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఆ మెసేజ్‌లకు ఎవ్వరూ స్పందించొద్దని, చట్టపరంగా నేరస్తులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

ప్రముఖులు, సెలబ్రెటీల పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచి దబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్‌లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేరారు. నకిలీ నెంబర్లు, డీపీలతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. 9353849489 నెంబర్ నుంచి సందేశాలు వస్తున్నాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆ నెంబర్‌కు డబ్బులు పంపొద్దని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. సైబర్ నేరగాళ్లపై చట్టపరంగా చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred