Asianet News TeluguAsianet News Telugu

కవితతో న్యాయవాదుల భేటీ:టీఆర్ఎస్ కు న్యాయవాదుల మద్దతు

ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందనిన్యాయవాదులు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను తెలంగాణ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు కలిశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం పాటుపడిన కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో జై కొడతామంటూ ప్రకటించారు. 

telangana lawyers support to trs party, announced in the presence oh mp kavitha
Author
Hyderabad, First Published Oct 8, 2018, 8:53 PM IST

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందనిన్యాయవాదులు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను తెలంగాణ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు కలిశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం పాటుపడిన కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో జై కొడతామంటూ ప్రకటించారు. 
 
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లను సీఎం కేసీఆర్ కేటాయించారని న్యాయవాదులు తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఇలా న్యాయవాదుల సంక్షేమం కోసం పాటుపడలేదన్నారు. 

ప్రతి న్యాయవాది కుటుంబానికి హెల్త్ కార్డ్స్ ఇచ్చారని అభిప్రాయపడ్డారు. న్యాయ వాదులకు మేలు చేసిన టీఆర్ఎస్ కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios