Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో రైతుల ర్యాలీకి హైకోర్టు అనుమతి

ఈ నెల 26న హైద్రాబాద్ లో రైతుల ర్యాలీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు  సోమవారం నాడు అనుమతి ఇచ్చింది.

Telangana high court green signals to farmers rally lns
Author
Hyderabad, First Published Jan 25, 2021, 9:04 PM IST

హైదరాబాద్:ఈ నెల 26న హైద్రాబాద్ లో రైతుల ర్యాలీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు  సోమవారం నాడు అనుమతి ఇచ్చింది. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో  రైతు సంఘాల ఆధ్వర్యంలో  ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి మద్దతుగా  హైద్రాబాద్ లో  రైతులు ర్యాలీ నిర్వహించనున్నారు.

ఈ మేరకు తెలంగాణ హైకోర్టు  ఈ ర్యాలీకి అనుమతి ఇచ్చింది. సరూర్‌నగర్ స్టేడియం నుండి ఉప్పల్ స్టేఢియం వరకు ర్యాలీ నిర్వహణకు కోర్టు అనుమతి ఇచ్చింది.కరోనా నిబంధనలు పాటిస్తూ ర్యాలీ నిర్వహించాలని హైకోర్టు సూచించింది.  ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ర్యాలీని నిర్వహించాలని హైకోర్టు సూచించింది. 

ర్యాలీ ప్రశాంతంగా జరిగేలా చూడాలని రాచకొండ కమిషనర్ కు ఆదేశించింది.నూతన వ్వవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో  నెలన్నర రోజులుగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలకు మద్దతుగా  ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios