టీఎస్‌పీఎస్‌సీ  ప్రశ్నాపత్రం లీక్  కేసులో  సీబీఐ విచారణ కు  తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.  

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును సీబీఐతో విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. పేపర్ లీక్ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖఱ్ రెడ్డి భార్య దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది .ఈ విషయమై అభ్యంతరాలుంటే సంబంధిత కోర్టులను ఆశ్రయించాలని హైకోర్టు పిటిషనర్ కు సూచించింది.