హైదరాబాద్ జవహర్ నగర్లో మహిళను వివస్త్రను చేసిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తనకు నివేదిక సమర్పించాల్సిందిగా సీఎస్, డీజీపీలను ఆమె ఆదేశించారు.
హైదరాబాద్ జవహర్ నగర్లో మహిళను వివస్త్రను చేసిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తనకు నివేదిక సమర్పించాల్సిందిగా సీఎస్, డీజీపీలను ఆమె ఆదేశించారు.
అసలేం జరిగిందంటే :
మద్యం మత్తులో ఓ కామాంధుడు యువతిపై దారుణానికి తెగబడ్డాడు. ఈ నెల 6న హైదరాబాద్ జవహర్నగర్లో ఓ యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో మారయ్య అనే వ్యక్తి ఆమెపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ హఠాత్ పరిణామానికి షాకైన ఆ యువతి అతనిని దూరంగా నెట్టేసింది. దీంతో ఆ కీచకుడు ఆమెపై దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా ఆమె బట్టలను చించి లాగేశాడు. ఆమె దాదాపు 15 నిమిషాల పాటు రోడ్డుపై నగ్నంగా పడివున్నా పట్టించుకున్న వారు లేరు. అంతా ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ చోద్యం చూశారు. ఈ ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించగా.. జాతీయ మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
Also Read: హైద్రాబాద్ జవహర్ నగర్ లో యువతిని వివస్త్ర చేసిన కేసు: వారం రోజుల్లో నివేదిక కోరిన జాతీయ మహిళ కమిషన్
