Asianet News TeluguAsianet News Telugu

Telangana Elections 2023: ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.. బారులు తీరిన జనం

Telangana Assembly  Elections 2023: తెలంగాణ ఎన్నిక‌ల పోలింగ్ ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. 119 స్థానాల్లోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, 13 లెఫ్ట్ వింగ్ తీవ్రవాద (LWE) ప్రభావిత స్థానాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియ‌నుంది. 
 

Telangana Elections 2023: Polling underway People in queues polling station RMA
Author
First Published Nov 30, 2023, 9:37 AM IST

Telangana Elections 2023: తెలంగాణ శాసనసభకు 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు పోలింగ్ జరుగుతుండగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, 13 లెఫ్ట్ వింగ్ తీవ్రవాద (LWE) ప్రభావిత స్థానాల్లో సాయంత్రం 4 గంటలకుపోలింగ్ ముగియ‌నుంది.

మొత్తం 3.26 కోట్ల ఓట‌ర్లు.. 

రాష్ట్రంలో 1,63,13,268 మంది పురుషులు, 1,63,02,261 మంది మహిళా ఓటర్లు సహా 3.26 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), ఆయన కుమారుడు  మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు (కేటీఆర్), రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి, బీజేపీ లోక్‌సభ సభ్యులు బండి సంజయ్ కుమార్, డీ అరవింద్ సహా 2,290 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. అక్టోబర్ 9న ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించడంతో రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది.

మూడు పార్టీల మ‌ధ్యే పోరు.. 

బీఆర్‌ఎస్ మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం 111, నటుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ తన మిత్రపక్షమైన సీపీఐకి ఒక సీటు ఇవ్వగా, మరో 118 స్థానాల్లో పోటీ చేస్తోంది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం నగరంలోని తొమ్మిది సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలబెట్టింది. అసెంబ్లీ ఎన్నికల కోసం 2.5 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉంటారని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.

భారీ భ‌ద్ర‌తా.. 

ఎన్నికల భద్రతా ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 375 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF)తో పాటు, రాష్ట్ర పోలీసులు, కేంద్ర‌, పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన హోంగార్డులతో కూడిన సుమారు 77,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 

ఇంటి నుంచే ఓటింగ్.. 

తెలంగాణలో తొలిసారిగా వికలాంగులకు, 80 ఏళ్లు పైబడిన ఓటర్లకు ఇంటింటికి ఓటు వేసే సౌకర్యం కల్పించారు. 

భారీగా న‌గ‌దు,  మ‌ద్యం స్వాధీనం

నవంబర్ 29 నాటికి, రాష్ట్రంలో అక్టోబర్ 9 న మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో దాదాపు రూ. 745 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, ఫ్రీబీస్‌తో సహా అన్నింటిని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయని అధికారిక ప్రకటన తెలిపింది.

సెల‌వు దినంగా.. 

ఉద్యోగులు తమ ఫ్రాంచైజీని వినియోగించుకునేందుకు వీలుగా ఐటీ సంస్థలతోపాటు అన్ని ప్రైవేట్ సంస్థలకు నవంబర్ 30న సెలవు ప్రకటించాలని ఎన్నిక‌ల సంఘం (ఈసీ) ఆదేశించింది.

డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు..

డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు దాదాపు ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios