అమెరికాలో టి బిజేపి అద్యక్షుడు లక్ష్మణ్ కి ఘన స్వాగతం
- అమెరికా పర్యటనలో టి బిజెపి అద్యక్షుడు లక్ష్మణ్
- న్యూజెర్సీలో ఆయనకు ఘన స్వాగతం, సన్మానం
అమెరికా పర్యటనలో భాగంగా న్యూ జెర్సీ కి చేరుకున్న తెలంగాణ బిజేపి అద్యక్షుడు లక్ష్మణ్ కి ఘన స్వాగతం లభించింది. ఆయనకు తెలంగాణ ఎన్నారై బీజేపి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న ఎన్నారైలతో లక్ష్మణ్ కాసేపు ముచ్చటించారు. అమెరికాలో బీజేపి బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఎన్నారైల కోసం బిజేపి ఆద్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేదని లక్ష్మణ్ అన్నారు.
లక్ష్మణ్ సన్మాన కార్యక్రమంలో ఎన్నారైలు శ్రీనివాస్ కొంపెల్లి, కె. శ్రీనివాస్ రెడ్డి , అడపా ప్రసాద్ , కృష్ణ రెడ్డి, భరత్ గోలి ,మధు బెల్లం , విలాస్ , శ్రీకాంత్ , దిగంబర్ సంతోష్ , అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.