21 మందితో కాంగ్రెస్ ప్రచార కమిటీ: స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించింది. 21 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించింది. 21 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది.
ఈ కమిటీ ఛైర్మెన్గా మల్లుభట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బాధ్యతలను ఇచ్చింది. ఈ కమిటీ ఉపాధ్యక్షురాలిగా మాజీ మంత్రి డీకే అరుణను నియమించారు.
స్టార్ క్యాంపెయినర్గా సినీ నటి విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల ప్రచార కమిటీకి కన్వీనర్గా మధు యాష్కీని నియమించారు. ఈ కమిటీలో తోట రవిశంకర్ తో పాటు 16 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఈ కమిటీ పర్యవేక్షించనుంది.ఈ కమిటీతో పాటు సినీ నటులు నగ్మా, కుష్బూలు కూడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, మాజీ ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ లు కూడ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
సంబంధిత వార్తలు
కేసీఆర్ను విమర్శిస్తున్నాం, మనమేం చేస్తున్నాం: విజయశాంతి విసుర్లు
కాంగ్రెస్, టీడీపీ పొత్తు: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
అన్న కేసీఆర్ వేరు, సీఎం కేసీఆర్ వేరే: విజయశాంతి
కత్తి దూసిన జానా: రాములమ్మ, జేజమ్మల విన్యాసాలు
ఎందుకో చెప్పాల్సిందే: కేసీఆర్కు విజయశాంతి సవాల్
చిరంజీవి, పవన్ లపై విజయశాంతి సంచలన కామెంట్స్
పవన్ డిఫరెంట్, ఇప్పుడే ఏం చెప్పలేం: విజయశాంతి
చిరుతో సై, శశికళను అందుకే కలిశా: విజయశాంతి
అందుకే పిల్లలు వద్దనుకొన్నాం: విజయశాంతి