నరసాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని భారీ లీడ్ తో ఓడించారు.
నరసాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. మొదట కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రౌండ్స్ గడిచే కొద్దీ పుంజుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి భారీ ఆధిక్యంలోకి వచ్చింది. ఒక దశలో సునీత లక్ష్మారెడ్డి 64748 ఓట్ల లీడ్ లోకి వెళ్లారు. . ఇక్కడ బీజేపీ అభ్యర్థి మురళీ యాదవ్ పెద్దగా ప్రభావం చూపలేదు.
Add Asianetnews Telugu as a Preferred Source

మొత్తంగా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. తాజా సమాచారం ప్రకారం 21 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మరో 43 చోట్ల లీడింగ్ లో ఉంది. బీఆర్ఎస్ అనూహ్యంగా పరాజయం వైపుగా వెళుతుంది. అదే సమయంలో బీజేపీ తన ఓటు షేర్ మెరుగుపరుచుకుంది. 2018తో పోల్చితే గౌరవప్రదమైన సీట్లు రాబడుతుంది. ఎమ్ఐఎమ్ కి భారీ షాక్ తగిలింది. తమ కమ్యూనిటీ ఓటు బ్యాంకు కూడా కోల్పోయారు. కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
