Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో సూర్యాపేట వాసి మృతి

 అమెరికాలో షాపింగ్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో సాయికి యాక్సిడెంట్ అయింది. భారీగా మంచు కురుస్తున్న సమయంలో సాయి డ్రైవ్ చేస్తున్న కారును టిప్పర్ ఢీకొట్టింది. 

Suryapeta Youth Died in USA
Author
hyderabad, First Published Nov 29, 2021, 9:29 AM IST

తెలంగాణ కుర్రాడు.. ఒకరు.. అమెరికాలో ప్రాణాలు కోల్పోయాడు. మరి కొద్ది రోజుల్లో ఇంటికి రావాల్సిన ఆ యువకుడు.. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.  సూర్యాపేట పట్టణంలోని నల్లాలబావి కాలనీకి చెందిన నరేంద్రుని లింగమూర్తి, సధారాణిల కుమారుడు చిరుసాయి (22) పై చదువుల కోసం 11 నెలల క్రితం అమెరికాకు వెళ్ళాడు. వచ్చే నెల 15 వ తేదీన సాయి ఇండియాకు రావాల్సి ఉంది. 

Also Read: ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించండి: టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ ఆదేశం

ఈ నేపథ్యంలో అమెరికాలో షాపింగ్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో సాయికి యాక్సిడెంట్ అయింది. భారీగా మంచు కురుస్తున్న సమయంలో సాయి డ్రైవ్ చేస్తున్న కారును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో సాయి అక్కడిక్కడే మరణించాడు. కారులో ప్రయాణిస్తున్న నల్లగొండకు చెందిన మరో యువతి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళింది.

Also Read: యాక్సిడెంట్ కేసు నుంచి తప్పించడానికి రూ. 20 వేల లంచం.. హోంగార్డు సహా ముగ్గురు అరెస్టు

చనిపోయిన సాయి మృతదేహాన్నీ ఇండియా కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఒక్కగానొక్క కొడుకు మరో 15రోజులలో సూర్యాపేటకు రావాల్సి ఉండగా, రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సాయి మృతి వార్తతో సూర్యాపేట పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios